GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉద్ధృతి... తెలంగాణలో 51 కొత్త కేసులు

GHMC gets more new cases as corona spreading continues in Telangana
  • జీహెచ్ఎంసీ పరిధిలో 37 మందికి కరోనా నిర్ధారణ
  • ఇవాళ రెండు మరణాలు
  • తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1326
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ 51 కొత్త కేసులు వెలుగుచూశాయి. వాటిలో 37 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. మరో 14 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1326కి చేరింది. ఇక ఇవాళ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 21 కాగా, ఇప్పటివరకు 822 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇవాళ మరో రెండు కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 32కి పెరిగింది. ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వ బులెటిన్ లో వెల్లడించారు.
GHMC
Hyderabad
Telangana
Corona Virus
COVID-19
Positive Cases

More Telugu News