హైదరాబాద్ లో ప్రముఖ సినీనటి కుమారుడికి కరోనా!
- అత్తగారింటికి వచ్చిన యువకుడు
- కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలింపు
- అపార్టుమెంట్ లోని అందరికీ వైద్య పరీక్షలు
- భారీగా పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య
జియాగూడ ప్రాంతంలో ఇప్పటివరకూ 68 కేసులు రాగా, సోమవారం నాడే 25 వచ్చాయి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించి, కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. మలక్ పేటలో పనిచేస్తున్న ఓ మహిళకు, సికింద్రాబాద్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేస్తున్న ఆమె కుమార్తెకు వ్యాధి సోకింది. వెంటనే సదరు సెంటర్ ను అధికారులు మూసివేయించి, ఉద్యోగులను క్వారంటైన్ చేశారు. మూసాపేట, యూసుఫ్ గూడ, చాదర్ ఘాట్, మలక్ పేట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి.