వండుకునేందుకు బియ్యం లేక... కింగ్ కోబ్రాను చంపి తినేసిన అరుణాచల్ వాసులు!
- ఆహారం కోసం అడవికి వెళ్లిన యువకులు
- విషసర్పం కనిపించడంతో దాంతోనే విందు
- వీడియో వైరల్ కావడంతో కేసు పెట్టిన అధికారులు
ఈ వీడియోలోని ఓ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇళ్లల్లో బియ్యం అయిపోయాయి. దీంతో ఏదైనా తినేందుకు తెచ్చుకోవాలని అడవికి వెళ్లగా, కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో దాన్నే ఆహారంగా చేసుకోవాలని వారు భావించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో, స్పందించిన అధికారులు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కింగ్ కోబ్రా ఈ చట్టం ప్రకారం రక్షిత సర్పం. ఈ నేరానికి వారికి బెయిల్ కూడా లభించదు.
అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో ఈ తరహా విషపూరిత సర్పాలు కోకొల్లలు. ఈ వీడియోలో కనిపించిన యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.