సినీ కార్మికులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు, ఔషధాల పంపిణీ
- చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు
- లాక్ డౌన్ నేపథ్యంలో 24 విభాగాల వారిని ఆదుకునేందుకు ప్రయత్నం
- తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని సూచన
టాలీవుడ్ కి చెందిన మొత్తం 24 విభాగాల్లోని పేద సినీ కార్మికుల జాబితాను ఇప్పటికే సీసీసీ సిద్ధం చేసింది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు తమ పేర్లను కమిటీలో నమోదు చేసుకోవాలని సీసీసీ సభ్యులు మరోపక్క సూచించారు. దీనిపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సీసీసీ కేవలం కరోనా కోసమే కాదని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా ముందుంటుందని, చిరంజీవి కూడా ఇది నిరంతరం పనిచేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని స్థాపించారని వెల్లడించారు.