గుంటూరు జిల్లాలో అప్రమత్తం.... 'కరోనా' వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారిని ఐదు అంబులెన్స్ ల్లో తరలింపు

Corona alert in Guntur district
  • గుంటూరు జిల్లాలో 4 పాజిటివ్ కేసులు
  • పలువురికి విందు ఇచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తి
  • విందుకు హాజరైన 30 మందిని గుర్తించిన అధికారులు
గుంటూరు జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు హాజరైన వారిపై అధికార వర్గాలు ఆరా తీశాయి. మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో 30 మందిని గుర్తించారు. వారందరినీ ఐదు అంబులెన్స్ ల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు, ఓ వ్యక్తి ఢిల్లీ వెళ్లి వచ్చిన అనంతరం రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో 23 మందిని కలిసినట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిని కూడా తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Guntur District
Corona Virus
Macherla
Narasaraopet
Ambulance
COVID-19

More Telugu News