అప్పట్లో 'విప్లవశంఖం' ఓ సంచలనం: మాదాల రవి
- 'యువతరం కదిలింది' ఓ ట్రెండ్ సెట్టర్
- 'ఎర్ర మల్లెలు' విజయవిహారం చేసింది
- 'విప్లవ శంఖం'లో ఆ పాట దూసుకుపోయిందన్న రవి
తరువాత వచ్చిన 'విప్లవ శంఖం' సంచలన విజయాన్ని సాధించింది. సెన్సార్ బోర్డువారు అభ్యంతరం వ్యక్తం చేసిన కొన్ని డైలాగ్స్ ను కట్ చేయడానికి నాన్నగారు నిరాకరించారు. ఈ విషయంపై ఆయన చాలాకాలం పాటు పోరాడారు. విడుదలైన ప్రతి థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈ సినిమాలోని మాటలు .. పాటలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. శ్రీశ్రీగారు .. నాన్నగారు మంచి మిత్రులు. శ్రీశ్రీగారితో నాన్నగారు రాయించిన 'కొంతమంది కుర్రవాళ్లు' పాట జనంలోకి దూసుకుపోయింది" అని చెప్పుకొచ్చారు.