Bangladesh: బంగ్లాదేశ్‌లో మూడు కరోనా కేసులు.. పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోదీ

Indian Prime Minister Modi Cancels Bangladesh Tour
భారత ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 17న మోదీ బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. అయితే, తాజాగా ఆ దేశంలో మూడు కరోనా కేసులు నమోదు కావడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

 ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు బంగ్లాదేశీయులకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో శత జయంతి వేడుకలను వాయిదా వేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ అబ్దుల్ చౌదరి తెలిపారు. కాగా, ఈ నెల 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో నిర్వహించనున్న ఇండో-ఈయూ సదస్సుకు కూడా మోదీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
Bangladesh
Narendra Modi
sheik mujibur rahman
Corona Virus

More Telugu News