అవసరముంటే.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగుతా: కోహ్లీ
- అత్యుత్తమ జట్టును కలిగివుండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడు
- రోహిత్, ధావన్, రాహుల్ ముగ్గురూ ఆడవచ్చు
- ఫామ్ లో ఉన్న ఏ ఆటగాడైనా జట్టుకు ఉపయోగకరం
‘ఫామ్ లో ఉన్న ఏ ఆటగాడైనా జట్టుకు ఎంతో ఉపయోగకరం. అత్యుత్తమ జట్టును కలిగివుండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటారు. అందులోనే సరైన కూర్పును ఎంచుకుంటారు. టాప్ ఆర్డర్ లో ఆ ముగ్గురూ ఆడే అవకాశముండొచ్చు. జట్టు కెప్టెన్ గా ఉన్న నేను అవసరమైనప్పుడు ఒక స్థానాన్ని భర్తీ చేసే స్థితిలో ఉండాలి. అది నా బాధ్యత. కెప్టెన్ గా జట్టును చూసుకోవడమే పని కాదు. మనం లేనప్పుడూ కూడా జట్టును సరైన దిశలో కొనసాగేలా చూడాలి’ అని కోహ్లీ అన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ను రేపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగనుండగా, రెండో వన్డే 17న రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, మూడో వన్డే 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది.