మా బిడ్డకు న్యాయం జరిగింది: నిర్భయ తల్లి వ్యాఖ్యలు

  • నిర్భయ దోషులకు డెత్ వారెంట్ 
  • జనవరి 22న ఉరి తీయాలన్న న్యాయస్థానం
  • హర్షం వ్యక్తం చేసిన నిర్భయ తల్లి ఆశాదేవి
ఎనిమిదేళ్ల కిందట దేశ రాజధానిలో నిర్భయపై ఘాతుకానికి పాల్పడిన మానవ మృగాలకు డెత్ వారెంట్ జారీ అయింది. ఆ నలుగురు కిరాతకులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆనందం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

ఆ నలుగురు దుర్మార్గులకు మరణశిక్ష అమలు చేయడం మహిళలకు మరింత ఆత్మస్థైర్యం కలిగిస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఈ తీర్పు ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, తీర్పు వెలువడిన అనంతరం న్యాయస్థానం వద్ద ఆశాదేవి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nirbhaya
Asha Devi
New Delhi
Court
India

More Telugu News