గిరిజన నృత్యోత్సవంలో రాహుల్ గాంధీ డ్యాన్స్
- డోలు వాయిస్తూ.. గిరిజనులతో మమేకం
- దేశం రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం.. వంటి సమస్యలను ఎదుర్కొంటోందన్న నేత
- అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ సాగాలని వ్యాఖ్య
ఈ వేడుకల్లో రాహుల్ గాంధీ గిరిజనులతో మమేకమైనారు. చేతిలో డోలు పట్టుకొని వాయిస్తూ.. వారి నృత్యాన్ని అనుకరించారు. రాహుల్ నృత్యాన్ని రికార్డు చేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశాయి. ఈ వీడియోకు కాంగ్రెస్ శ్రేణుల నుంచేకాక, సాధారణ నెటిజన్ల నుంచి కూడా లైకులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్బంగా రాహుల్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో, రాష్ట్రాల్లో చెలరేగుతున్న ఆందోళనలను ప్రస్తావించారు.‘ఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నామని కూడా తెలుసు. నేను చెప్పదలచుకున్నదొక్కటే.. అన్ని జాతులు, మతాలు, తెగల ప్రజలను సమన్వయం చేసుకుంటూ వెళ్లకపోతే దేశాన్ని ముందుకు నడిపించలేం’ అని అన్నారు