యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు
- యాదాద్రి పునర్నిర్మాణ పనులను వివరించిన జగదీశ్ రెడ్డి
- కాసేపట్లో వరంగల్ కు గవర్నర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి పునర్నిర్మాణ పనులను గవర్నర్కు జగదీశ్ రెడ్డి, అధికారులు వివరించారు. యాదాద్రి ఆలయానికి గవర్నర్ తమిళిసై రావడం ఇదే తొలిసారి. కాసేపట్లో ఆమె వరంగల్ నగరానికి చేరుకొని, అక్కడి కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలించనున్నారు.