Vote for Note Case: మరోసారి తెరపైకి ఓటుకు నోటు కేసు.. సుప్రీంకోర్టులో ఎర్లీ హియరింగ్ పిటిషన్

  • పిటిషన్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • 2017లోనే పిటిషన్ వేసిన ఆళ్ల
  • పిటిషన్ లిస్ట్ కాకపోవడంతో.. మరోసారి పిటిషన్
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసుపై ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలైంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. 2017లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేసినప్పటికీ... సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ లిస్ట్ కాలేదు.

దీంతో, ఆయన మరోసారి సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో పాటు, కొన్ని రోజులు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Vote for Note Case
Chandrababu
Revanth Reddy
Alla Ramakrishna Reddy
Supreme Court

More Telugu News