పూలదండ కోసం ప్లాస్టిక్ కవర్ వాడిన ప్రిన్సిపాల్.. జరిమానా విధించిన జిల్లా కలెక్టర్
- ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్
- సింగిల్ యూజ్ కవర్లు, బాటిళ్ల వాడకంపై ఆగ్రహం
- ప్రిన్సిపాల్ కు రూ. 1000 జరిమానా
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, పూలమాలలను సింగిల్ యూజ్ కవర్లలో తీసుకొచ్చారని, తాగు నీటిని కూడా సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ ద్వారానే అందించారని చెప్పారు. వందలాది మంది విద్యార్థులు ఉన్న చోట ఇలాంటి పనులు చేయడం సరికాదని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికే తాను అలా చేశానని చెప్పారు. ఇలాంటి వస్తువులను ప్రభుత్వ కార్యక్రమాల్లో వాడితే... సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని అన్నారు.
దీనిపై ప్రిన్సిపాల్ చౌహాన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహించిందని, అన్ని ఏర్పాట్లు వారే చేశారని చెప్పారు. పాలిథిన్ బ్యాగుల్లో పూలమాలలు తీసుకురావడం వల్ల జిల్లా కలెక్టర్ జరిమానా విధించారని తెలిపారు. తమ పాఠశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తమ పాఠశాలలో నిర్వహించినందువల్ల, అన్నీ సరిగ్గా ఉన్నాయో? లేదో? చూసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని కలెక్టర్ చెప్పారని అన్నారు.