Jagan: జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట తప్పారు: నక్కా ఆనందబాబు

  • అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం మోసం చేసిందన్న నక్కా
  • టీడీపీ హయాంలో రూ.310 కోట్లు విడుదలకు జీవో ఇచ్చామని వెల్లడి
  • ఇప్పుడు రూ.260 కోట్లే విడుదల చేశారంటూ వ్యాఖ్యలు
మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.260 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, టీడీపీ హయాంలోనే రూ.310 కోట్లు విడుదల చేయాలంటూ జీవో విడుదలైందని నక్కా వెల్లడించారు. కానీ అందులో రూ.50 కోట్లు తగ్గించి విడుదల చేయడం దారుణమని విమర్శించారు.
Jagan
Agrigold
Andhra Pradesh
YSRCP

More Telugu News