బోటు వెలికితీత ప్రయత్నంలో.. బలంగా లాగడంతో వంగిపోయిన లంగరు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం సర్వశక్తులు ఒడ్డి శ్రమిస్తున్నా బోటు వెలికితీత అత్యంత కష్టంగా పరిణమిస్తోంది. బోటు రెయిలింగ్ లంగరుకు తగులుకుని బయటికి రావడంతో ధర్మాడి సత్యం బృందంలో ఉత్సాహం రెట్టించింది. అయితే, ఓ పెద్ద లంగరుతో బోటును చుట్టి బయటికి లాగేందుకు ప్రయత్నించినా ఈసారి లంగరు వంగిపోయింది. ఈ పరిణామంతో ధర్మాడి సత్యం బృందం నిరాశకు గురైంది. ఎవరైనా నదిలో దిగి బోటుకు సరైన ప్రాంతంలో లంగరు ఫిక్స్ చేస్తే తప్ప బోటు బయటికి రాదని సత్యం భావిస్తున్నారు. ఇప్పటికే కొందరిని సంప్రదించినా నదిలో లోతుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.

Boat
Godavari
East Godavari District

More Telugu News