అలాగైతే ఆర్టీసీ నిండా మునిగిపోతుంది: ప్రొఫెసర్ నాగేశ్వర్
- ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉంది
- మూడు వేల అద్దె బస్సులు పెంచితే మరింత నష్టం
- కార్మికుల వల్లే ఆర్టీసీకి నష్టమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం
అద్దె బస్సులు పెంచుతున్న తీరును నాగేశ్వర్ తప్పుబట్టారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని, మూడు వేల అద్దె బస్సులు పెంచితే నిండా మునిగిపోతుందని చెప్పారు. ఏటా ఆ సంస్థకు వస్తున్న నష్టాలు రూ.720 కోట్లని వివరించారు.
కార్మికులు సమ్మె చేస్తోంది వేతనాల కోసం కాదని నాగేశ్వర్ అన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసమే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆర్టీసీ పట్టణ రవాణాల్లోనే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. బస్సులకు లాభాలు వచ్చే మార్గాల్లో ప్రైవేటు బస్సులు అధికంగా నడుస్తున్నాయని నాగేశ్వర్ తెలిపారు. మరోవైపు నష్టాలు వచ్చే మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని వివరించారు.