గోదావరి బోటు ప్రమాదం: రెండో రోజూ దొరకని గల్లంతైనవారి ఆచూకీ!
- సహాయక చర్యల్లో 600 మంది
- బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్టు అంచనా
- ప్రతికూల వాతావరణంతో వెనుదిరిగిన నేవీ హెలికాప్టర్లు
ఏడుగురు నేవీ డైవర్లు, 80 కంట్రీబోట్లతో గాలింపు ముమ్మరం చేశారు. నీటి అడుగుకు చేరుకోగల నైపుణ్యం ఉన్నవారు కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకున్నారు. సైడ్ స్కాన్ సోనార్ పరికరంతో డీప్ డైవర్లు బోటును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా 600 మంది సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతున ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో డెహ్రాడూన్ నుంచి వచ్చిన 30 మందిని రంగంలోకి దించారు. వీరు నేడు సహాయక చర్యల్లో పాలు పంచుకోనున్నారు.