ఏపీ సీఎం జగన్ బంధువుతో మెదక్ ఎస్పీ దీప్తి వివాహం?

  • వరంగల్ కు చెందిన చందన దీప్తి
  • ఢిల్లీ ఐఐటీ నుంచి పట్టా పొంది ఐపీఎస్ కు ఎంపిక 
  • కేసీఆర్ కు శుభలేఖ అందించిన ఐపీఎస్ అధికారిణి
తెలంగాణలోని మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి పెళ్లికూతురు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బంధువు ఒకరిని ఆమె వివాహమాడనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ ను నిన్న ప్రగతిభవన్ లో కలిసిన దీప్తి, తన వివాహానికి రావాలని శుభలేఖను అందించారు.

వరంగల్ లో పుట్టిన దీప్తి చదువంతా హైదరాబాద్ లో సాగింది. ఐఐటీ ఢిల్లీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్న ఆమె, 2012లో సివిల్స్ రాసి ఐపీఎస్  గా ఎంపికయ్యారు. తెలంగాణలో జిల్లాల పునర్విభజన అనంతరం మెదక్ ఎస్పీగా పనిచేస్తున్నారు. చందనా దీప్తికి భరతనాట్యంలో మంచి ప్రవేశం ఉంది. కాగా, దీప్తి వివాహం నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కలుసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
kin
Telangana
Medak SP
chandana depti
Marriage

More Telugu News