Andhra Pradesh: బీజేపీ చీఫ్ అమిత్ షాను చూసి చంద్రబాబు వణికిపోతున్నారు!: వైసీపీ నేత విజయసాయిరెడ్డి

  • నేతలు పార్టీని వీడుతున్నా కిక్కురమనడం లేదు
  • అవినీతి కేసులు తిరగదోడుతారని భయం పట్టుకుంది
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలంతా పోలోమని బీజేపీలో చేరుతున్నా కిక్కురుమనలేని పరిస్థితి చంద్రబాబుదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షాకు కోపం వస్తుందేమోనని చంద్రబాబు వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు.

అందుకే పార్టీ వదిలివెళుతున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయడం లేదని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులు తిరగదోడుతారన్న భయంతోనే చంద్రబాబు సైలెంట్ అయిపోయినట్లు ఉన్నారని విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
BJP
YSRCP
Amit Shah
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam

More Telugu News