సముద్రుడిలో ఐక్యమయ్యేందుకు బిరాబిరా కృష్ణమ్మ పరుగులు!

  • కృష్ణానదిపై నిండిన అన్ని ప్రాజెక్టులు
  • వస్తున్న నీటిని వస్తున్నట్టు వదిలేస్తున్న అధికారులు
  • లంక గ్రామాల్లో అధికారులు అప్రమత్తం
ఇక కృష్ణమ్మ పరుగులన్నీ సముద్రుడి వైపే. దాదాపు పది సంవత్సరాల తరువాత నదీమతల్లి మహోగ్రరూపం దాల్చగా వస్తున్న నీరు ఈ సాయంత్రం నుంచి సముద్రంలో కలవనుంది. ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లు పూర్తిగా నిండిన స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వస్తున్న నీటిని వస్తున్నట్టు అన్ని ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నాయి. ఈ మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజ్ నిండిపోనుండగా, సాయంత్రం నుంచి నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల 5 లక్షల క్యూసెక్కులను దాటితే, లంక గ్రామాల్లోకి నీరు చేరుతుందని, వారిని అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. 
Go Back to Shorts
Krishna River
Lanka Villages
Nagarjuna Sagar
Srisailam
Prakasam Barrage

More Telugu News