ఈడీ మాజీ అధికారి శ్రీనివాస్ గాంధీపై మనీ లాండరింగ్ కేసు నమోదు

  • రాజకీయ నాయకుడికి సాయం చేసి భారీగా లబ్ధిపొందిన గాంధీ
  • రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఈడీ
  • త్వరలోనే ఆస్తుల అటాచ్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అధికారి శ్రీనివాస్ గాంధీపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు గాంధీపై కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును దాఖలు చేసింది. ఆయన భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈసీఐఆర్‌లో పేర్కొంది. ఈ నెల 8న గాంధీపై సీబీఐ అక్రమాస్తుల కేసును నమోదు చేసింది.

 సీబీఐ కేసు ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసిన ఈడీ.. హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై దాడులు చేసింది. ఈ సందర్భంగా రూ.200 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. ఏపీ, హైదరాబాద్‌లలో శ్రీనివాస్ గాంధీ భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆయన అక్రమాస్తులను అటాచ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిర్ణయించారు.

ఓ రాజకీయ నాయకుడి జీఎస్టీ కేసును పర్యవేక్షించిన శ్రీనివాస్ గాంధీ ఆయనకు అనుకూలంగా వ్యవహరించి భారీగా లబ్ధిపొందినట్టు ఆరోపణలున్నాయి. 2010 నుంచి గాంధీ ఈడీలో పనిచేస్తూ వచ్చారు. 2010లో రూ.21 లక్షలుగా ఉన్న ఆయన ఆస్తులు 2019లో ఏకంగా రూ.3.74 కోట్లకు పెరిగాయి.
Go Back to Shorts
ED
CBI
Srinivas Gandhi
Vijayawada
Hyderabad

More Telugu News