మన భూభాగంలోకి చైనా సైన్యం చొరబడలేదు: ఆర్మీ చీఫ్
- డెంచోక్ సెక్టార్ లో చైనా సైనికులు చొరబడ్డారంటూ వార్తలు
- సైనిక చొరబాటు జరగలేదన్న బిపిన్ రావత్
- బోర్డర్ లో పరిస్థితి సాధారణంగా ఉందంటూ వ్యాఖ్య
ఈ వార్తలపై రావత్ మాట్లాడుతూ, నియంత్రణ రేఖ వద్దకు కొందరు చైనీయులు వచ్చారని... వారిని మనం అడ్డుకున్నామని చెప్పారు. మన భూభాగంలో నివసిస్తున్న మన టిబెటన్లు వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఏం జరుగుతోందో చూద్దామనే కుతూహలంతో చైనీయులు వచ్చారని చెప్పారు. అంతేకాని, సైనిక చొరబాటు జరగలేదని తెలిపారు. బోర్డర్ లో పరిస్థితి సాధారణంగానే ఉందని చెప్పారు.