సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి: ముప్పాళ్ల నాగేశ్వరరావు

  • విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సమావేశం
  • 3 మాసాల్లోగా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు
  • సీఎంని కలిసి వినతిపత్రం అందజేస్తాం 
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా ఇరవై వేల లోపు ఉన్న బకాయిలను చెల్లిస్తామని అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు గుర్తుచేశారు. విజయవాడలోని దాసరి భవన్ లో 13 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మూడు మాసాల్లోగా పదకొండు వందల ఎనభై కోట్లు విడుదల చేస్తామని తన పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని అన్నారు. ఈ మేరకు ఓ వినతిపత్రంను జగన్ ని కలిసి అందజేయనున్నట్టు తెలిపారు. ముందుగా ఫ్యాక్స్, మెయిల్ ఐడీ ద్వారా జగన్ కు, హోం మంత్రి సుచరితకు తమ వినతిపత్రాలు పంపుతామని చెప్పారు.
Go Back to Shorts
agri gold
muppalla
nageswara rao
Vijayawada

More Telugu News