ప్రధాని మోదీకి మరో గౌరవం.. ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించనున్న మాల్దీవులు!
- రెండోసారి బాధ్యతల స్వీకరణ అనంతరం తొలి పర్యటన
- కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ
- అనంతరం శ్రీలంకకు పయనం
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజుద్దీన్’ అవార్డును ప్రకటించాలని మాల్దీవులు నిర్ణయించింది. ఈ విషయాన్ని మాల్దీవుల ప్రధాని అబ్దుల్లా షాహీద్ ప్రకటించారు. ఈ పర్యటన తర్వాత శ్రీలంకకు ఆదివారం వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఈస్టర్ ఉగ్రదాడుల్లో చనిపోయిన ప్రజలకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు. తిరిగి అదేరోజున భారత్ కు చేరుకుంటారు.