లెక్కింపులో అభ్యంతరాలుంటే ఫిర్యాదుకు రెండు నిమిషాల సమయం!
- కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి నిల్
- లెక్కింపుపై అభ్యంతరాలు ఉంటే నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాలన్న ఎన్నికల సంఘం
కాగా, ఓట్ల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడికి మధ్య రెండు నిమిషాల సమయం ఉంటుంది. ఓట్ల లెక్కింపుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ లోపు నియోజకవర్గ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. తమ కార్యాలయానికో, కేంద్ర ఎన్నికల సంఘానికో ఫిర్యాదు చేస్తే ప్రయోజనం ఉండదని, నియోజకవర్గ ఎన్నికల అధికారి లెక్కింపు కేంద్రంలోనే అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.