పెళ్లికి అంగీకరించరని.. చదువుకున్న పాఠశాలలోనే ఉరేసుకున్న ప్రేమ జంట
- మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న కనకయ్య-తార
- రెండేళ్ల క్రితం గొడవ జరిగినా మళ్లీ మామూలే
- పురుగుల మందు తాగి ఆపై ఉరేసుకున్న ప్రేమికులు
కనకయ్య కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కాగా, కనకయ్య-తార గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే, రెండేళ్ల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో యువతి తల్లిదండ్రులు గ్రామంలో పంచాయితీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనకయ్య కుటుంబానికి పంచాయితీ పెద్దలు రూ.30 వేల జరిమానా విధించారు. ఈ ఘటన తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. దీంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఇద్దరూ తాము చదువుకున్న పాఠశాలకు వచ్చి పురుగుల మందు తాగారు. అనంతరం తరగతి గదిలో ఒకే కొక్కానికి ఉరివేసుకున్నారు. గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.