రిజర్వ్ బ్యాంక్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు!
- ఆర్టీఐ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే
- వార్షిక నివేదికలను బహిర్గతం చేయండి
- రుణాల ఎగవేతదారుల పేర్లు చెప్పాల్సిందే
- ఆర్బీఐ తీరు కోర్టుకు వ్యతిరేకంగా ఉందన్న న్యాయమూర్తి
గత జనవరిలో వార్షిక తనిఖీల నివేదికను బయట పెట్టేందుకు ఆర్బీఐ నిరాకరించగా, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయినా ఆర్బీఐ స్పందించకపోవడంతో తీవ్రంగా మండిపడిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్, చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని ఆర్బీఐని హెచ్చరించింది. ఆర్బీఐ వ్యవహరిస్తున్న తీరు 2015లో తామిచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉందని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నివేదికలను బహిర్గతం చేసే విషయంలో తాము ఆఖరి చాన్స్ ఇస్తున్నామని అన్నారు.