ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడూ చూడలేదు: వర్ల రామయ్య ఫైర్
- కోడూరులోని ఓ బూత్ లో ఎక్కువ ఓట్లు పోలయ్యాయి
- రిగ్గింగ్ జరిగినట్టే కదా?
- సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశా
ఎన్నికల కమిషన్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? రిగ్గింగ్ జరిగినట్టే కదా? అక్కడి ఆర్వో, జిల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అని మండిపడ్డారు. ఆ బూత్ లో రిగ్గింగ్ జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తోందని, దీనిపై కూడా సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశామని, ఈ ఫిర్యాదు చూసిన ఆయన నోరు వెళ్లబెట్టారని వ్యాఖ్యానించారు. ఈ బూత్ లో 109 శాతం ఓట్లు పోలయ్యాయని, ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడూ చూడలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.