ప్రశాంత్ కిశోర్ పై బిహార్ మాజీ సీఎం ఆరోపణలు!
- ఆర్జేడీని జేడీయూలో విలీనం చేయమన్నారు
- ప్రశాంత్ కిశోర్ పై రబ్రీదేవీ మండిపాటు
- ఆయన్ను వెంటనే వెళ్లిపోవాలని చెప్పినట్లు వ్యాఖ్య
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రశాంత్ కిశోర్ ద్వారా ఈ ప్రతిపాదనను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆర్జేడీ-జేడీయూ విలీనం ప్రతిపాదనను ప్రశాంత్ కిశోర్ తన వద్దకు తెచ్చారని లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవితచరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయమై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. జేడీయూలో చేరక మునుపు తాను చాలాసార్లు లాలూతో భేటీ అయ్యాయని స్పష్టం చేశారు. అప్పుడు తాము ఏం మాట్లాడుకున్నామో బయటపెడితే లాలూ ప్రసాద్ యాదవే ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు.