ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం!

  • ద్వైపాక్షిక సంబంధాల కృషికి ప్రకటించిన యూఏఈ 
  • ఇరుదేశాల సంబంధాల పటిష్టత కోసం చేసిన కృషికి గుర్తింపు
  • గతంలో ఇదే అవార్డును అందుకున్న పుతిన్, సర్కోజీ, మెర్కల్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారం ‘జయాద్ మెడల్’ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రకటించింది. భారత్-యూఏఈల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడేందుకు మోదీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును యూఏఈ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జయాద్ ప్రకటించారు.

ఈ అత్యున్నత పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరసన ప్రధాని మోదీ చేరారు.
Go Back to Shorts
India
uae
Narendra Modi
BJP
highest civilian honour
zayed medal

More Telugu News