కర్నూలులో ప్రధాని సభకు వైసీపీ కార్యకర్తలు!

  • శుక్రవారం కర్నూలులో మోదీ బహిరంగ సభ
  • జెండాలు, కండువాలతో హాజరైన వైసీపీ కార్యకర్తలు
  • బారికేడ్లకు వైసీపీ జెండాలు
కర్నూలులో శుక్రవారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ఈ సభకు ప్రధాని మోదీ హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు స్టేడియంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తల జేబుల్లో వైసీపీ జెండాలు, కండువాలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పక్కనపడేసిన అనంతరం వారిని లోపలికి పంపించారు. లోపలికి వచ్చిన కొందరు వైసీపీ కార్యకర్తలు బారికేడ్లకు ఆ పార్టీ జెండాలు తగిలించారు. ఈ సభలో మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి హిందీలోకి మారారు. రాజమహేంద్రవరానికి చెందిన హిందీ ప్రొఫెసర్ సుందర్‌రామ్‌ ప్రధాని ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు.
Go Back to Shorts
Narendra Modi
Kurnool District
YSRCP
YSRCP flags
Andhra Pradesh

More Telugu News