రూ. 500 కోట్ల హెరాయిన్ స్మగ్లింగ్.. బోటును ధ్వసం చేసిన కోస్ట్ గార్డ్స్

  • గుజరాత్ సముద్ర తీరంలో కోస్ట్ గార్డ్స్ దాడి
  • వందల కేజీల హెరాయిన్ ను తరలిస్తున్న ఇరాన్ జాతీయులు
  • స్మగ్లర్లను ప్రశ్నిస్తున్న నావికాదళ అధికారులు
హెరాయిన్ స్మగ్లర్లపై ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఉక్కుపాదం మోపారు. రూ. 500 కోట్ల విలువైన హెరాయిన్ ను తరలిస్తున్న బోటుపై దాడి చేసి, 9 మంది ఇరాన్ జాతీయులను పట్టుకున్నారు. అనంతరం బోటుతో పాటు మాదకద్రవ్యాలను ధ్వంసం చేశారు. గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వందల కేజీల హెరాయిన్ ను ఇండియాలోకి అక్రమంగా తరలించేందుకు ఇరాన్ జాతీయులు ప్రయత్నిస్తుండగా... మన కోస్ట్ గార్డ్స్ దాన్ని గుర్తించారు. ప్రస్తుతం వారిని నావికాదళ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Go Back to Shorts
heroine
gujarath
coast guards
500 crores

More Telugu News