పాకిస్థాన్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
- పాక్ క్రికెట్ పట్ల భారత్ అన్యాయంగా వ్యవహరించింది
- పీఎస్ఎల్ ప్రసారాలను ఆపేశారు
- అందుకే ఈ నిర్ణయం అంటూ పాక్ మంత్రి ప్రకటన
ఈ మేరకు పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌధురీ ప్రకటన చేశారు. క్రీడలపై రాజకీయ ప్రభావం పడకుండా చూడాలని ఎంతో ప్రయత్నించామని, కానీ భారత్ పీఎస్ఎల్ ప్రసారాలపై నిషేధం విధించడంతో తాము కూడా ఐపీఎల్ ప్రసారాలపై నిర్ణయం తీసుకోదలిచామని చౌధురీ స్పష్టం చేశారు. పీఎస్ఎల్ పై నిషేధం విధించిన సమయంలో భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు తమపై ఎలాంటి వైఖరి ప్రదర్శించాయో తమకు గుర్తుందని, ఇప్పుడూ ఐపీఎల్ విషయంలో కూడా తమ వైఖరి అలాగే ఉంటుందని అన్నారు.