పార్లమెంటు ప్రాంగణంలో పేపర్ విమానాలు విసిరిన కాంగ్రెస్ నేతలు
- నేడు పార్లమెంటు ముందుకు రానున్న రాఫెట్ డీల్ పై కాగ్ రిపోర్టు
- పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్
- పేపర్ విమానాలను గాల్లోకి విసిరిన నేతలు
ఈ సందర్భంగా పేపర్ విమానాలను గాల్లోకి విసిరారు. వీటిపై మోదీ, అనిల్ అంబానీల చిత్రాలను అతికించారు. రాఫెల్ అంశానికి సంబంధించిన కాగ్ రిపోర్టు ఈరోజు పార్లమెంటు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాగ్ రిపోర్టును తీసి పారేశారు. కాగ్ రిపోర్టును 'చౌకీదార్ (కాపలాదారుడు) ఆడిటర్ జనరల్' రిపోర్టుగా అభివర్ణించారు. మరోవైపు, కాగ్ రిపోర్టులో యుద్ధ విమానాల ధరలను పేర్కొనలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.