పటేల్ విగ్రహానికి సందర్శకుల తాకిడి.. భారీ ఆదాయం!
- నర్మద నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు
- మూడు నెలల్లో రూ.19 కోట్ల ఆదాయం
- పెరుగుతున్న పర్యాటకుల తాకిడి
గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి మధ్య విగ్రహాన్ని ఏకంగా 7,81,349 మంది సందర్శించారు. వీరి నుంచి ఏకంగా 19.47 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు పర్యాటక శాఖ అధికారి ఒకరు తెలిపారు. విగ్రహంతోపాటు పక్కనే ఉన్న సర్దార్ సరోవర్ డ్యాంను సందర్శించే వారి సంఖ్య కూడా పెరిగిందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కేజే ఆల్పాన్స్ తెలిపారు. మూడు నెలల్లో 8,22,009 మంది డ్యాంను సందర్శించినట్టు వివరించారు.