మరో మహా యాగానికి సిద్ధమైన కేసీఆర్.. తేదీలు ఖరారు
- మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగాన్ని నిర్వహించనున్న కేసీఆర్
- ఎర్రవెల్లి ఫాంహౌస్ లో జనవరి 21 నుంచి 25 వరకు యాగం
- పాల్గొననున్న 200 మంది రుత్విక్కులు
మాణిక్య సోమయాజి, నరేంద్ర కాప్రే, ఫణిశశాంక శర్మ, పురాణం మహేశ్వర శర్మ తదితరుల ఆధ్వర్యంలో ఈ యాగం జరగనుంది. ఇందులో 200 మంది రుత్విక్కులు పాల్గొననున్నారు. యాగ నిర్వహణకు సంబంధించి మాణిక్య సోమయాజితో నిన్న కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. మరోవైపు, ఈ యాగానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వచ్చే అవకాశం ఉంది.