మా పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒడిశా ముఖ్యమంత్రి గారు!: చంద్రబాబు
- ఒడిశాతో స్నేహపూర్వక సంబంధాలు
- చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
- ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి
ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూరిత సంబంధాలకు ముందడుగు వేశాం. ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ ద్వారా జాతీయ స్థాయిలో మేము చేస్తోన్న పోరాటానికి మద్దతిచ్చిన ఒడిషా ముఖ్యమంత్రి @Naveen_Odishaకు అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకుంటాం’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.