కాంగ్రెస్ కార్యకర్తలపై ఈగను కూడా వాలనివ్వను!: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిపై అనుమానాలు ఉన్నాయి
- డబ్బు, ఈవీఎంల ట్యాంపరింగ్ తో టీఆర్ఎస్ గెలిచింది
- హామీలు నెరవేర్చక పోతే టీఆర్ఎస్ నేతల భరతం పడతాం
డబ్బు సంచులు, ఈవీఎంల ట్యాంపరింగ్ తో టీఆర్ఎస్ 88 స్థానాలను గెలుచుకుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే టీఆర్ఎస్ నేతల భరతం పడతామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని చెప్పారు. తన నియోజకవర్గంలోని 6 మండలాల్లో తన తల్లి సుశీలమ్మ ట్రస్ట్ తరపును 6 అంబులెన్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.