పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు గడువు కోరిన సజ్జన్ కుమార్
- సజ్జన్ కుమార్ కు యావజ్జీవ శిక్ష
- ఈ నెల 31లోగా పోలీసులకు లొంగిపోవాలన్న కోర్టు
- నెల రోజులు గడువు కావాలన్న సజ్జన్
కాగా, ఇదే కేసుకు సంబంధించిన రెండో కేసు విచారణ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు సజ్జన్ హాజరయ్యారు. తన తరపు న్యాయవాది అందుబాటులో లేని కారణంగా ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సజ్జన్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఈ కేసు విచారణను జనవరి 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు సజ్జన్ తన మొబైల్ ఫోన్ ను న్యాయస్థానానికి అందజేశారు.