చంద్రబాబుకు చెయ్యివ్వనున్న మాయావతి... విపక్షాల సమావేశానికి డుమ్మా!
- విపక్షాలను ఏకం చేసే ప్రయత్నాల్లో చంద్రబాబు
- ఇప్పటికే పలు పార్టీల నేతలతో చర్చలు
- ఎన్నికల ఫలితాలను చూసి నిర్ణయం తీసుకోనున్న మాయావతి
చంద్రబాబు చొరవతో ఈ సమావేశానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లతో పాటు సమాజ్ వాదీ తదితర ప్రధాన పార్టీలన్నీ హాజరవుతామని ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా, ఈ సమావేశం 10న పెట్టుకోవడం కంటే, 11న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత పెట్టుకుంటే బాగుంటుందన్నది మాయావతి అభిప్రాయమట.
ఇదే విషయాన్ని వెల్లడించిన ఆ పార్టీ నేత ఒకరు, 10న సమావేశానికి మాయావతి హాజరు కాబోవడం లేదని తెలిపారు. కాగా, ఈ సమావేశానికి రాబోమని డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కూటమిపై చర్చించేందుకు మరింత సమయం ఉందన్నది ఈ పార్టీల అభిప్రాయం.