కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. మాగంటి గోపీనాథ్, సతీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం

  • యూసుఫ్ గూడలో ఉద్రిక్తత
  • సతీష్ రెడ్డిని అరెస్ట్ చేయబోయిన పోలీసులు
  • సర్దిచెప్పిన మేయర్ బొంతు రామ్మోహన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్ గూడలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ నాయకుడు సతీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయబోయారు. అయితే, మేయర్ బొంతు రామ్మోహన్ సర్దిచెప్పడంతో, వివాదం సద్దుమణిగింది. 
Go Back to Shorts
KTR
road show
jubilee hills
Maganti Gopinath
satish reddy

More Telugu News