Hyderabad: కోటి దీపోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్!

  • హైదరాబాద్ లో కోటి దీపోత్సవం
  • ఎన్టీఆర్ పార్క్ కు వచ్చిన పవన్ కల్యాణ్
  • ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత
హైదరాబాద్ లోని ఇందిరాపార్కు సమీపంలో గల ఎన్టీఆర్ పార్క్ లో తెలుగు టీవీ చానల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి నాడు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన, పరమశివునికి ప్రత్యేక పూజలు చేసి, దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి 'ఎన్ టీవీ' చైర్మన్ చౌదరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు, కార్తీక దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పలువురు పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.



Hyderabad
Pawan Kalyan
Koti Deepotsavam
NTV

More Telugu News