ap: ఏపీలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న ఈసీ!

  • ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
  • రేపటి నుంచే వీవీ పాట్ యంత్రాల తరలింపు
  • వివరాలను వెల్లడించిన ఎన్నికల ప్రధాన అధికారి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అప్పుడే సన్నాహకాలు చేసుకుంటోంది. ఫిబ్రవరి మూడవ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా తెలిపారు. ఏపీలో కొత్తగా 30 లక్షల మంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారని చెప్పారు. రేపటి నుంచి దశలవారీగా వీవీ పాట్ యంత్రాలను తీసుకొస్తామని తెలిపారు. ఈవీఎంల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు భెల్ కంపెనీకి తరలిస్తున్నామని చెప్పారు. 
ap
assembly
elections
schedule

More Telugu News