తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. ధర్నా చౌక్ ను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఆదేశాలు!
- మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన కోర్టు
- ఆరు వారాల పాటు అమల్లో ఉంటుందని వెల్లడి
- తెలంగాణ ప్రభుత్వం, పోలీసులకు నోటీసులు
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రజల భద్రత కోసమే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని తెలిపారు. ధర్నా చౌక్ కారణంగా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందనీ, ట్రాఫిక్ భారీగా స్తంభిస్తోందని వాదించారు. అయితే ఈ వాదనలను పిటిషనర్లు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా నేడు మరోసారి పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ధర్నాచౌక్ ను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆదేశాలు ఆరువారాల పాటు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు నోటీసులు జారీచేసింది.