టీఆర్ఎస్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌లో చేరా: భూపతిరెడ్డి

  • కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన భూపతిరెడ్డి
  • కాంగ్రెస్‌లో చేరిన భూపతిరెడ్డి అనుచరులు
  • రాష్ట్రాన్ని నిరుద్యోగ తెలంగాణ చేశారు
కేసీఆర్ పాలనపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నిప్పులు చెరిగారు. ఇటీవలే ఆయన టీఆర్ఎస్‌‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన అనుచరులు 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచ్‌లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రాష్ట్రాన్ని ఉద్యోగ తెలంగాణగా మారుస్తానని చెప్పి, నిరుద్యోగ తెలంగాణను చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని భూపతిరెడ్డి అన్నారు. 
Go Back to Shorts
Bhupathi Reddy
Uttam Kumar Reddy
Gandhi Bhavan
KCR
TRS

More Telugu News