దివంగతనేతకు యూపీలో స్మారక కేంద్రాల ఏర్పాటు
- మహానేత వాజ్పేయికి నివాళిగా యోగి సంచలన నిర్ణయం
- యూపీలో నాలుగు స్మారకకేంద్రాల ఏర్పాటు
- వాజ్పేయి చితాభస్మం యూపీలోని 75 జిల్లాల ప్రధాననదుల్లో నిమజ్జనం
ఆగ్రాలోని వాజ్పేయి పూర్వీకుల గ్రామం బటేశ్వర్తో పాటు, ఆయన తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బలరామ్ పూర్లోను, వాజ్పేయి రాజీనీతి శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన కాన్పూర్లోను, రికార్డు స్థాయిలో ఐదుసార్లు లోక్సభకు ఎన్నికైన లక్నో నగరంలోను నాలుగు స్మారకాలను నిర్మించాలని యూపి ప్రభుత్వం భావిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ మహానేత వాజ్పేయికు నివాళిగా ఎప్పటికీ గుర్తుండేలా ఈ ఆలోచన చేసి స్మారకకేంద్రాల నిర్మాణానికి సంకల్పించినట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.