స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా బ్లాక్ మనీనే అని ఎలా చెబుతాం?: కేంద్ర మంత్రి గోయల్

  • అక్రమ డిపాజిట్లు చేసిన వారిపై చర్యలు తప్పవు
  • స్విస్ బ్యాంకుల ఖాతాల వివరాల సేకరణ ప్రారంభం కానుంది
  • ఏడాది చివరి కల్లా తుది సమచారం అందుతుంది
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మళ్లీ ఊపందుకున్నాయనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు ఇన్ ఛార్జ్ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ డిపాజిట్లన్నీ నల్లధనమే అని ఎలా భావిస్తామని అన్నారు.

అయితే, అక్రమ డిపాజిట్లు చేస్తున్న వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్విట్జర్లాండ్ తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా తుది సమాచారం ప్రభుత్వానికి అందుతుందని అన్నారు. గత మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల వల్ల స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 
Go Back to Shorts
swiss bank
black money
piyush goyal
deposits

More Telugu News