హైదరాబాద్లో ఆస్తమా రోగులు బయటకు రావొద్దు: హెచ్చరిస్తున్న నిపుణులు
- భాగ్యనగరంలో డేంజర్ గాలి
- నాణ్యత ప్రమాణాలను దాటేసి ప్రమాదకరస్థాయికి
- శ్వాసకోశ, గుండెజబ్బులున్న వారికి హెచ్చరిక
ఈ విషయంలో అధికారుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాలి నాణ్యతను నమోదు చేసి వదిలేయడం తప్ప, నాణ్యత ప్రమాణాలు పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. గాలిలోని నలుసు పదార్థాల తీవ్రత పెరిగినప్పుడు దానిని పీలిస్తే నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతాయని, దీంతో ఆస్తమా ఉన్న వారి పరిస్థితి విషమంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భాగ్యనగరంలోని గాలిలో నలుసు పదార్థాలు ఎక్కువ స్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రజలు ముఖ్యంగా ఆస్తమా రోగులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఈ గాలిని పీల్చడం ద్వారా మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారు కూడా ఆరు బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్లు, వ్యాపార కేంద్రాలున్న చోట నివసించే ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న పేర్కొన్నారు.