పాకిస్థాన్ గూఢచారికి జీవిత ఖైదును ఖరారు చేసిన హైదరాబాద్ హైకోర్టు
- టూరిస్టు వీసాపై ఇండియాకు వచ్చిన ఆషిక్ అలీ
- పాకిస్థానీతో మాట్లాడుతుండగా అరెస్ట్ చేసిన నిజామాబాద్ పోలీసులు
- జీవిత ఖైదు సరైనదేనన్న హైదరాబాద్ హైకోర్టు
సున్నిత సమాచారాన్ని పాక్ కు ఈ-మెయిల్ ద్వారా పంపించాడు. ఆపై 2002 జనవరి 26 రాత్రి నిజామాబాద్ లోని జానపల్లి జంక్షన్ నుంచి, పాకిస్థాన్ లోని ఓ వ్యక్తికి ఫోన్ చేస్తూ పట్టుబడ్డాడు. కేసును విచారించిన నిజామాబాద్ కోర్టు, ఐపీసీలోని పలు సెక్షన్లు, విదేశీ వ్యవహార చట్టాలు, అధికార రహస్యాల చట్టాల కింద విచారించి జీవిత ఖైదును విధించింది. దీనిపై దోషి ఆషిక్ అలీ, హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు తీర్పిస్తూ, జీవిత శిక్ష సరైనదేనని వ్యాఖ్యానించింది.