Congress: ప్రధాని మోదీ నటనకు ఆస్కార్ ఇవ్వాలి : కాంగ్రెస్ ఎంపీ కేవీపీ

  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం
  • అఖిలపక్షం పేరుతో చంద్రబాబు మరో డ్రామా 
  • గుర్తింపు పొందిన ఏ ఒక్క పార్టీ ఈ సమావేశానికి హాజరుకాలేదు
పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ నటనకు ఆస్కార్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా కూడా అవిశ్వాసంపై చర్చకు రాకుండా చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంంద్రబాబునాయుడిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అఖిలపక్షం పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని, అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీ లేవీ వెళ్లకపోవడం చంద్రబాబుకు సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Congress
kvp
Chandrababu
modi

More Telugu News